Ad Code

Responsive Advertisement

రైలు లో వీరందరికి ప్రయాణం ఉచితమే..!

 



ట్రైన్ జర్నీ చేయాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. రైల్వే ప్రయాణంపై రాయితీ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ కొందరికి ట్రైన్ టికెట్ ధరలో తగ్గింపు అందిస్తోంది. వికలాంగులు, విద్యార్థులు, అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్స్, రైతులు, కళాకారులు, క్రీడాకారులు వంటి పలువురికి ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా రాయితీలను చాలా మందికి నిలుపుదల చేశారు. కానీ ఎంపిక చేసిన రోగులు, స్టూడెంట్స్, వికలాంగులకు మాత్రమే తగ్గింపు ఉంది.

75 శాతం వరకు రాయితీ..

ట్రైన్ టికెట్ ధరపై 75 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. వికలాంగులకు ఈ బెనిఫిట్ ఉంది. సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, 3ఏసీ, ఏసీ చైర్ కార్ వంటి తరగతులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఇంకా రోగులు, వ్యాధిగ్రస్తులు ఏకంగా పూర్తిగా 100 శాతం వరకు ట్రైన్ టికెట్ ధరలో తగ్గింపు పొందొచ్చు. క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా, ఎయిడ్స్


వీరికి మాత్రం సగం వరకు తగ్గింపు

ట్రైన్ టికెట్ ధరలపై సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు 50 శాతం వరకు రాయితీ లభిస్తోంది. 58 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన మహిళలకు ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. 60 ఏళ్లు లేదా ఆపైన వయసు ఉన్న పురుషులకు 40 శాతం రాయితీ లభిస్తుంది. అన్నీ తరగతుల ప్రయాణానికి తగ్గింపు వర్తిస్తుంది. ఇంకా పోలీస్ మెడల్, శ్రమ్ అవార్డ్ తీసుకున్న వారికి, నేషనల్ అవార్డు తీసుకున్న టీచర్లు, నేషనల్ బ్రేవరీ అవార్డు పొందినవారికి కూడా ట్రైన్ టికెట్‌లో 50 నుంచి 75 శాతం మధ్యలో తగ్గింపు పొందొచ్చు. యుద్ధంలో భర్తను కోల్పోయిన వారు సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌ టికెట్లలో 75 శాతం తగ్గింపు పొందొచ్చు.


విద్యార్థులకు మాత్రం ఇలా

స్టూడెంట్స్ ఇంటికి వెళ్లేటప్పుడు లేదా ఎడ్యుకేషన్ టూర్‌కు వెళ్లేటప్పుడు జనరల్ కేటగిరి కింద 50 శాతం, ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరి కింద 75 శాతం తగ్గింపు పొందొచ్చు. గర్ల్స్ గ్రాడ్యుయేషన్ వరకు, బాయ్స్ 12వ తరగతి వరకు (ఇంటి నుంచి స్కూల్ మధ్య ప్రయాణానికి ఉచిత సెకండ్ క్లాస్ ఎంఎస్‌టీ టికెట్ పొందొచ్చు. వర్క్ క్యాప్‌కు వెళ్లే విద్యార్థులు 25 శాతం, రీసెర్చ్ పనిలో భాగంగా ప్రయాణించే రీసెర్చ్ స్కాలర్స్ (35 ఏళ్ల వయసు వరకు) 50 శాతం, యూపీఎస్‌సీ అండ్ సెంట్రల్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లేవారు 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ గర్ల్స్ జాతీయ స్తాయి ఎంట్రెన్స్ టెస్ట్‌లు రాయడానికి వెళ్తే 75 శాతం తగ్గింపు పొందొచ్చు.


క్రీడాకారులు, నిరుద్యోగులకు కూడా

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వెళ్తే 50 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు వెళ్తే స్లీపర్ క్లాస్‌లో 50 శాతం, సెకండ్ క్లాస్‌లో 100 శాతం తగ్గింపు పొందొచ్చు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్.. స్కౌటింగ్ డ్యూటీపై వెళ్తే 50 శాతం రాయితీ ఉంది. క్రీడాకారులు ఆల్ఇండియా అండ్ స్టేట్ టోర్నమెంట్స్‌లో పాల్గొనేందుకు వెళ్తే 75 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అయితేరైల్వే టికెట్లపై తగ్గింపు అనేది కేవలం టికెట్ బేసిక్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. సూపర్‌ఫాస్ట్ చార్జీలు, రిజర్వేషన్ ఫీజు వంటి వాటికి వర్తించదు. రాయితీ కనీసం 300 కిలోమీటర్ల ప్రయాణానికి వర్తిస్తుంది. విద్యార్థులు, రోగులకు ఇందుకు మినహాయింపు ఉంది.

Post a Comment

0 Comments

Close Menu